Breaking News

మూసాపేట్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: కూకట్పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో మూసాపేట డివిజన్లో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్,డివిజన్ అద్యక్షులు అంబటి శ్రీనివాస్ అధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు స్థానిక ప్రజలందరూ ఏకతాటిపై బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని అన్నారు. డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సతీష్ గౌడ్ ,నరసింహ యాదవ్, ముందడీ శ్రీనివాసరావు,జూపల్లి సత్యనారాయణ,మాజీ కార్పొరేటర్ బాబురావు, గౌసుద్దిన్, డివిజన్ అద్యక్షులు అంబటి శ్రీనివాస్ , ప్రభాకర్ గౌడ్, జిల్లా గోపాల్,తూము కొండల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *