Breaking News

కూకట్ పల్లిలో వ్యక్తి అదృశ్యం… కేసు నమోదు చేసిన పోలీసులు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: ఇంట్లో నుండి ఊరికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాకుండా అదృశ్యమైన ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లి సాయిబాబా కాలనీకి చెందిన సోమేపల్లి రవిబాబు (40) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ నెల 14న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశంకు బయలుదేరి వెళ్లారు. అక్కడికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *