Breaking News

నేటిస్త్రీ సంస్థ ఆధ్వర్యంలో 3కే వాక్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: కెసిఆర్ ప్రభుత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటి మహిళా పార్క్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు 

 

కూకట్ పల్లి ఐడియల్ చెరువు వద్ద నేటి స్త్రీ సంస్థ ఆధ్వర్యంలో 3కే వాక్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలకు మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వ్యాయామం చేసుకోవడానికి అనుకూలంగా పార్కులకు పెద్దపీట వేశారని అందులో భాగంగానే హైదరాబాదులో మొట్టమొదటి మహిళా పార్కును కూడా కూకట్ పల్లిలో ఏర్పాటు చేశామన్నారు. నగరంలో కాలుష్యం,ఉద్యోగ ఒత్తిడి అధిగమించడానికి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఉపయోగకరమని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేటి స్త్రీ సంస్థ వారికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు దేవి రెడ్డి, విజయశ్రీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *