Breaking News

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆరోగ్యం బాగుండాలి అని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు

కూకట్ పల్లి: నేటి తెలంగాణ:

కూకట్ పల్లి రామాలయంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గారు బాగుండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో చాలా కృషి చేశారని అలాంటి నాయకుడు కేసీఅర్ గారు అనుకోకుండా కాలు విరగడం బాధాకరమైన విషయమనీ ఆయురారోగ్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదంతో త్వరగా కోలుకోవాలని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, తులసి రావు డివిజన్ అధ్యక్షులు సంతోష్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *