Breaking News

ముషీరాబాద్ మెట్రో స్టేషన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: ముషీరాబాద్ మెట్రో స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్‌లోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటలు కమ్ముకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *