Breaking News

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన.. కేంద్రం సంచలన నిర్ణయం

ఢిల్లీ: నేటి తెలంగాణ :మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన మేలో జరగ్గా.. ఇటీవలే వీడియో బయటకొచ్చి వైరలైంది. ఈ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *