Breaking News

రోడ్డు పనుల్లో జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయలి – ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: అల్లాపూర్ డివిజన్లోని సర్దార్ నగర్ లో గత కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సబ్దర్ నగర్ లోని ఈ బ్లాక్ లో రోడ్డుకు దిగువ బాగాన ఉన్న మజీద్ వైపు లోతట్టు ఉండడం వలన రాబోయే వర్షాకాలంలో రోడ్డు వేసినట్లయితే మజీద్ వైపు ఇండ్లు మునిగిపోయే అవకాశం ఉంటుందని స్థానికులు సమస్యను వ్యక్తపరిచారు. దీనితో ఎమ్మేల్యే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి రోడ్డుకు సమానంగా దిగువ భాగాన ఉన్న లోతట్టు ప్రాంతాన్ని సమానంగా చేయాలని ఎట్టి పరిస్థితిలోనూ వర్షపు నీరు డ్రైనేజ్ నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా వెళ్లిపోవాలని ఆ విధంగా చర్యలు తీసుకుని రోడ్డు పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశించారు.
అదేవిధంగా సర్దార్ నగర్ ఈ బ్లాక్ లో మంచినీటి పైప్ లైన్ ను ఏర్పాటు చేసి కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదని మహిళలు చెప్పారు. వెంటనే వాటర్ వర్క్స్ తో అధికారులతో మాట్లాడి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే మంచినీటి కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు గౌసుద్దీన్, వీరారెడ్డి, హమీద్, రియాజ్, బాబా, సలీం, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *