Breaking News

వర్షాలకు కులిపోయిన ఇంటికి నష్టపరిహారం చెల్లించేందుకు కృషి చేస్తా:కార్పెంటర్ సంగీత గౌరీ శంకర్.

రాజేంద్ర నగర్:హైదర్గూడా గ్రామంలో పురాతన ఇల్లు భారీ కుండ పోత వర్షం కారణంగా కుప్పకూలింది.ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంటి యజమాని జగన్ బయటికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.గురువారం అత్తాపూర్ డివిజన్ హైదర్గూడా గ్రామంలో పురాతన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయిన ఈ విషయం తెలుసుకున్న అత్తాపూర్ కార్పోరేటర్ సంగీత గౌరీ శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని విషయాన్ని జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు.అనంతరం ఇల్లు కూలినందుకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు నా వంతు కృషి చేయడం జరుగుతుందని అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత గౌరీ శంకర్ హామీ ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *